telugu navyamedia
రాజకీయ

కాషాయ తీర్థం పుచ్చుకున్నపోస్టర్ గర్ల్ ప్రియాంక..

ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌కు ఎదుర‌దెబ్బ త‌గిలింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ.. రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక మౌర్య కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త కొద్ది రోజులుగా ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ అధిష్టానంపైనా అసంతృప్తితో ఉన్నారు ప్రియాంక మౌర్య.

UP Assembly polls 2022

ప్రియాంక మౌర్య బుధవారం బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడి బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా చర్చలు జరిపిన అంనంతరం ప్రియాంక మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో తాను కష్టపడి పనిచేశానన్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. కానీ మా హక్కుల సంగతి వచ్చేసరికి మమ్మల్ని పక్కన పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రచారం కేవలం బూటకమని ప్రియాంక విమర్శించారు.

Dr. Priyanka Maurya Homeopathy - YouTube

మహిళా సాధికారతకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యమిస్తుందని చాటిచెప్పేలా.. ప్రియాంక గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లడ్​కీ హూ.. లడ్​ సక్తీ హూ’ కార్యక్రమానికి ప్రియాంక మౌర్య పోస్టర్ గర్ల్​ కావడం గమనార్హం

Related posts