telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పోస్టల్ శాఖ లో .. 3650 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

postal jobs with just ssc passed

పోస్టల్ శాఖ 3650 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మహిళలకు, వికలాంగులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. వయో పరిమితి 18 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 30, 2019.

పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే :

http://www.appost.in/gdsonline/Notifications/Maharashtra-14.pdf ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

Related posts