telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పవన్‌ కళ్యాణ్‌పై బండ బూతులతో విరుచుకుపడ్డ పోసాని కృష్ణ మురళి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటం తెలిసిందే. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తనని టార్గెట్‌ చేశారని ఆరోపిస్తూ పోసాని మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ పోసాని మాట్లాడుతూ.. నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని తెలిపారు.

పవన్ పై పగ పెట్టుకునే ఆలోచన లేదు. నేను జగన్ అభిమానిని.. అందుకే రియాక్ట్ అయ్యాను. నిన్నటి నుంచి ప్రతి సెకండ్ కు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తున్నాయి.. బూతులు తిడుతున్నారు. రాజకీయాలకు, ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటి..? చిరంజీవిపై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు. ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు. పవన్ ఒక సైకో.. ఎవరో ఫంక్షన్లు పెట్టుకుంటే అక్కడికి పవన్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారని పోసాని మరోసారి పోసాని మండిపడ్డారు.

పవన్‌ కల్యాణ్‌ అనే సైకో వెదవకి చెబుతున్నా.. ఒరేయ్ సైకో వెదవ నీకూ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకో నేను బతికే ఉంటా, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడకా, నా భార్యను అన్ని మాటలు అన్నందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా’ అంటూ పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Related posts