*నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
*రాజాసింగ్ను బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలింపు
*రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
*రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై వివిధ పీఎస్ల్లో ఫిర్యాదులు
*భారీ బద్రత నడుమ రాజాసింగ్ కోర్టుకు తరలింపు..
*నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ ఉదయం రాజాసిగ్ ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షల కోర్టులో హాజరుపరిచారు.
భారీ ఎత్తున నాంపల్లి కోర్టు వద్ద నినాదాలు చేస్తున్న రాజాసింగ్ అనుచరులకు పోలీసులు అడ్డుకున్నారు.. ఉద్రిక్తతల నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా..మునావర్ ఫరూఖీ కామెడీ షో ను నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపణలు చేసింది. దీంతో ఈ వీడియోను తొలగించాలని యూట్యూబ్ కు హైద్రాబాద్ పోలీసులు కోరారు..
దేశాన్ని నడిపే డబులు ఇంజన్ అంటే మోదీ -ఈడీ అని ఇప్పుడే గ్రహించాం..