సింగరేణి కాలనీ బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించి.. తన రూంకి తీసుకెళ్లి పాశవికంగా చిన్నారిని హత్య చేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వెళ్లిపోయిన కీచకుడు రాజు గురించి హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. మరోవైపు నిందితుడి కోసం హైవేలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైవేలపై పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్విస్తున్నారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తుండగా అతడి స్నేహితుడు పోలీసులకు లభించాడు…పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు.
అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు. రాజు చేసిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని… ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజు ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నిస్తున్నారు.
రాజును ఎలాగైనా పట్టుకోవాలని మొత్తం 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాడి నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడు చిక్కడంతో రాజు కూడా ఇక చిక్కుతాడని పోలీసులు భావిస్తున్నారు..కల్లు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో రాజు తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు.