telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వామనరావు హత్యకు ఉపయోగించిన ఒక కత్తి లభ్యం…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల దారుణ హత్య కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఇక, వామన్‌రావు దంపతులను నిందితులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.. దీంతో.. ఈ కేసులో కత్తులు కీలకంగా మారాయి.. ఆదివారం రోజు పొద్దుపోయిన వారకు సుందిళ్ల బ్యారేజీలో కత్తుల కోసం గాలించిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. రెండో రోజు కూడా ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.. అయినా ఇప్పటి వరకు వాటి జాడ లభించలేదు.. హత్య కోసం వినియోగించిన కత్తులు సుందిళ్ల బ్యారేజీలోని 58-62 పిలర్స్ మధ్యలో వేసినట్టు నిందితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆ ప్రాంతంలో కత్తుల కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. కత్తులను వెలికితీసే ప్రయత్నంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి మరీ.. గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే తాజాగా వారి శ్రమకు ఫలిత దొరికింది. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులలో ఒక్కటి పోలీసులకు దొరికింది. దాంతో ఇప్పుడు రెండో దానికోసం గాలింపు చర్యలు చెప్పటారు.

Related posts