ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన వాచీలు, చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పద్మావతిపురంలో నివాసం ఉంటున్న వైసీపీనేత గణపతినాయడు ఇంటిపై సోమవారం వేకువజామున పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన గోడ గడియారాలు, చీరలు పోలీసులకు పట్టుబడ్డాయి.
ముందస్తు సమాచారం మేరకు తిరుచానూరు సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వైసీపీ నేత ఇంటిపై దాడులు నిర్వహించారు. ఓ గదిలో భారీగా భద్రపరచిన గోడగడియారాలు, చీరలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.