*కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడిలో రెచ్చిపోయిన రేణుకాచౌదరి..
*పోలీస్ స్టేషన్కు వచ్చి కొడతానంటూ పోలీసులకు రేణుకా వార్నింగ్
*ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకాచౌదరి పై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు..
కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు .
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్ఐ ఉపేంద్ర రేణుకా చౌదరిపై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదుచేశారు . ఐసీపీ 353 సెక్షన్ కింద రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్లో ముట్టడిలో రేణుకాచౌదరి రెచ్చిపోయారు. కార్యకర్తలతో కలిసి రాజ్భవన్వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు.. దీంతో పోలీసులకు ఆమెకు వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో రేణుకా చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్కు వచ్చి కొడతానని ..పిచ్చివేశాలు వేస్తున్నారేంటి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడిలో రెచ్చిపోయిన రేణుకాచౌదరి మహిళా పోలీసులను నెట్టివేశారు .అక్కడే ఉన్న ఎస్ఐ ఉపేంద్ర బాబు కాలర్ పట్టుకున్నారు.
ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు.