బీటెక్ విద్యార్ధిని దివ్య హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రేమ పేరుతో దివ్య ప్రాణాన్ని బలిగొన్న దుర్మార్గుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. విజయవాడలో దివ్య తేజస్వినిని హత్య చేసిన నాగేంద్రబాబు గుంటూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. నాగేంద్ర అరెస్ట్కు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే డిచార్జ్ అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపట్లో నాగేంద్రబాబును విజయవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం దివ్యని అతి కిరాతకంగా చంపాడు నాగేంద్రబాబు. తర్వాత తనని తాను గాయపర్చుకున్నాడు. గాయాలపాలైన నాగేంద్రను పోలీసులు గుంటూరు ఆస్పత్రిలో చేర్పించారు. జీజీహెచ్ లో గత నెల 15 నుంచి చికిత్స పొందుతున్న నాగేంద్రబాబుకు నయం కావడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేసారు. నాగేంద్ర బాబుని తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. మరో వైపు దివ్య తేజస్విని హత్య విషయంలో నాగేంద్రతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దివ్యను మర్డర్ చేసే విషయంలో నాగేంద్రకు సహకరించిన వ్యక్తులను కేసు పరిధిలోకి తీసుకువచ్చేలా అడుగులు వేస్తున్నారు పోలీసులు.ఈ కేసుకు సంబంధించి ఇన్స్టాగ్రాం, నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోనున్నారు.
previous post
next post
అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి