*విద్యుత్ సౌధ దగ్గర ఉద్రిక్తత
*విద్యుత్ సౌధను ముట్టడించిన తెలంగాణ మహిళా కాంగ్రెస్ ..
*హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. .
*పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట
హైదరాబాద్ విద్యుత్ సౌధ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించారు. పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి తోపులాటలో కిందపడిపోయారు. ఆమెకు శ్వాస సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ వైద్యులు విద్యారెడ్డికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. విద్యుత్ సౌధ వద్ద మిగిలిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గోషామహల్ మైదానానికి తరలించారు.
మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు