పోలవరంలో మరో కీలక అంకానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. అదే దిశలో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. తాజాగా పోలవరం స్పిల్ ఛానెల్లో మళ్లీ కాంక్రీట్ పనులు మొదలయ్యాయి. 2020 జూలైలో వచ్చిన వరదలకు నిలిచిపోయిన స్పిల్ ఛానెల్ మట్టి, కాంక్రీట్ పనులు ఇవాళ మళ్లీ మొదలయ్యాయి. వరదలకు దాదాపు 3 టీఎంసీలకు పైగా వరద నీరు నిలిచిపోయింది. 2020 నవంబర్ 20 నుంచి ప్రారంభమైన వరద నీటి తొడకం…. వరద నీటి ని తోడేందుకు దాదాపు 70 భారీ పంపుల ఏర్పాటు చేశారు. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు షురూ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రెండున్నర టీఎంసీల వరద నీటిని గోదావరి నదిలోకి పంప్ చేసింది నిర్మాణ సంస్థ. స్పిల్ ఛానెల్లో కాంక్రీటు పనులతో పాటు మట్టి తవ్వకం.. అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలైయ్యాయి. ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని పూర్తి అయ్యాయి. స్పిల్ ఛానెల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు ఈ ఏడాది జూన్ నెలలోగా పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశారు అధికారులు.
previous post
next post
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి