telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విక్రమ్ లాండింగ్ పై ప్రధాని .. ప్రతి అపజయం .. గొప్ప విజయానికి ఆరంభం ..

pm on vikram landing and isro

ప్రధాని నరేంద్రమోదీ భారతదేశ విజయం కోసం శాస్త్రవేత్తలంతా తీవ్రంగా ప్రయత్నించారని కొనియాడారు. భరతమాత తలెత్తుకునేలా జీవితాన్ని ధారపోశారని అన్నారు. చంద్రయాన్‌-ప్రయోగం అనంతరం బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భరతమాత కలలను సాకారం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించారని, ఏం జరిగింది? ఎలా జరిగిందన్నది శాస్త్రవేత్తల మెదళ్ల నుంచి తొలగించాలని మోదీ అన్నారు. ” మీ బాధను నేనూ పంచుకుంటున్నాను.

దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగింది. మన విజయాలకు మరిన్ని భారీ కొలమానాలు పెట్టుకోవాలి.ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదాం. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత ధృఢంంగా తీర్చిదిద్దుతాయి. సాధించిన ఫలితాలతోపాటు సాగించిన కృషి కూడా గుర్తించాలి. చంద్రయాన్‌ 2 విషయంలో గొప్ప ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేశారని గర్వంగా చెబుతాను” అని ప్రధాని మోదీ అన్నారు.

Related posts