telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌పై మోడీ ట్వీట్‌..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి వేడుకలతో పాటు పటాన్‌ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు

ఈ క్ర‌మంలో ప్రధాని మోడీ సోష‌ల్ మీడియా వేదికగా తన కార్యక్రమాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. ‘నేడు రోజు హైదరాబాద్‌లో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పవిత్రమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక బోధనలు మనకు స్ఫూర్తినిచ్చే శ్రీరామానుజాచార్యకు ఇది గొప్ప‌ నివాళి అని అన్నారు..

మధ్యాహ్నం 2:45 గంటలకు వ్యవసాయ, ఆవిష్కరణలకు వేదికైన ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నాను’’ అని ట్విటర్‌ లో రాసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నానని మరో ట్వీట్ చేశారు.

Related posts