*హైదరాబాద్లో పర్యటన పై మోదీ ట్వీట్
*ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
* బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తాం..
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గవర్నర్ తమిళసైతో పాటు ఇతర బీజేపీ నాయకులు బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఆహ్వానానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని షేర్ చేశారు.
‘డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం.’ అని తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022