ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఎవరెవరికి ఏఏ మంత్రిపదవులు దక్కుతాయనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రధాని ప్రమాణ స్వీకారం రోజే సీఎంగా జగన్ ప్రమాణం కూడా ఉండటంతో మోదీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగా అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 272ను మించి ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుచుకుంది.వరుసగా రెండో పర్యాయం ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన దరిమిలా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల