telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

narendra-modi

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మోదీపేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts