హోలీ పండుగ పురస్కరించుకుని భారతదేశం అంతటా సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు.
రంగుల పండుగ హోలీ పురస్కరించుకుని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు.
“మీ అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. పరస్పర ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ రంగుల పండుగ మీ అందరి జీవితంలో ఆనందాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “రంగులు పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, అదృష్టం కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.