telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి పంట ముగుస్తున్న తరుణంలో… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2 వేల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాలోకి 7 విడతల నగదు జమ కాగా..ఇప్పుడు 8వ విడతల డబ్బులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. నగదును ఏప్రిల్ చివరి వారం నుంచి దశల వారీగా రైతుల ఖాతాలో వేయనుంది. ఇక ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు..పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

Related posts