telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాలో మరో భారీ పెట్టుబడి.. పిరమాల్‌ ఫార్మాఫెసిలిటీ …

piramal more investments in telangana

రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ పిరమాల్‌, ప్రస్తుతం రాష్ట్రంలో తనకున్న పిరమాల్‌ ఫార్మాఫెసిలిటీ బలోపేతం చేస్తూ విస్తరించేందుకు సుమారు 500 కోట్ల రూపాయలను రానున్న మూడు సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టన్నుట్టు ప్రకటించింది. పిరమాల్‌ గ్రూప్‌ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌తో మంత్రి కె. తారక రామారావు దోవోస్‌లో సమావేశమైన అనంతరం సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గ్రూప్‌ తెలంగాణ రాష్ర్టానికి ఇంత భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి సంస్ధకు కావల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంట్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న ఫార్మా యూనిట్‌ విస్తరణంలో భాగంవగా నూతన తయారీ బ్లాకులు ఏర్పాటు, వేస్‌ హౌస్‌ విస్తరణ వంటి వాటికి ఈ ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు పిరమాల్‌ గ్రూప్‌ తెలిపింది. ప్రస్తుతం తన ప్లాంట్‌ విస్తరణతో పాటు ఇతర రాష్ర్టాల్లో ఉన్న ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తామని పిరమాల్ర్‌గూప్‌ తెలిపింది.

తెలంగాణలో ఉన్న అనుకూలత, ప్రభుత్వ పాలసీలను పరిగణలోకి తీసుకుని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో పాటు హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేసి తన తయారీ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. తన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీలో భాగంగా హెల్త్‌కేర్‌, సురక్షిత తాగునీరు, డిజిటల్‌విలేజ్‌ వంటి కార్యకలాపాలను చేపట్టనున్నట్టు కూడా సంస్థ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో కంపెనీకి అన్ని అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు ఉన్నాయని, జీరో డిస్చార్జ్‌ విధానంలో , పర్యావణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా తమ పిరమాల్‌ గ్రూప్‌పనిచేస్తుందని తెలిపారు. హెల్త్‌కేర్‌ ర ంగంలో ఇప్పటికే 1400 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుతం 500 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి ద్వారా మరో 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన ప్లాంట్‌ రాబోతున్న స్థలాన్ని సందర్శించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పిరమాల్‌ గ్రూప్‌ సినీయర్‌ ప్రతినిధి బృందం పర్యటిస్తుందని తెలిపారు.

Related posts