telugu navyamedia
క్రైమ్ వార్తలు

లాడ్జ్‌లో లింగ‌మార్పిడి ఆప‌రేష‌న్‌. తీవ్ర రక్తస్రావంతో ట్రాన్స్‌జెండర్‌ మృతి

*తక్కువ ఖర్చుతో ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్..

*ఆపరేషన్‌ మొదలుపెట్టిన బీ–ఫార్మసీ విద్యార్థులు
*తీవ్ర రక్తస్రావంతో ట్రాన్స్‌జెండర్‌ మృతి
*నెల్లూరులో దారుణం..

*యువ‌కుడు మృతి కార‌ణ‌మైన బీ ఫార్మ‌సీ విద్యార్ధులు

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ గా మారాలనుకున్న ఓ యువకుడు చివరకు విగతజీవిగా మారాడు. నెల్లూరులో ఇద్దరు బీఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతార‌మెత్తి నిండు ప్రాణాన్ని బ‌లికొన్నారు.

వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్‌ అలియాస్‌ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది.

ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది. అయితే శ్రీకాంత్‌ హిజ్రాగా మారాలని నిర్ణయం తీసుకోవడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీఫార్మసీ విద్యార్థులు తామే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చారు.

దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని ఎస్‌ఎస్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయం తో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాం గాన్ని తొలగించారు.

దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్‌ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్‌ మృతిచెందాడు. దీంతో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం

Related posts