telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పనీ పాటాలేని వాళ్ళే “బిగ్ బాస్”కు వస్తారు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Payal-Rohatgi

ప్రస్తుతం అన్ని భాషల్లో బిగ్ బాస్ షో విజయవంతగా నడుస్తోంది. ఈ షోను హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ అనేది వందరోజులు, 16 మంది సెలెబ్రెటీలు, పూర్త ఎంజాయ్మెంట్ అంటూ మొదలైనప్పటికీ ఈ షో లో ప్రేక్షకులకు మరింత ఉత్సహాన్ని కలిగించేందుకు టాస్కులు అంటూ హౌస్లోని సెలెబ్రెటీలకు గొడవలు పెడతారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ షో పై పలురకాల విమర్శలు, వివాదాలు కూడా ఉన్నాయి. జనాలను ఎంటర్టైన్ చేస్తామంటూ సదరు టెలివిజన్ యాజయాన్యం జనాల ఆలోచనలతో టిఆర్పి రేటింగ్ పెంచుకొని క్యాష్ చేసుకుంటారు. బిగ్ బాస్ అనే ముసుగుతో వెలుగులో వారి అజమాయిషిని కొనసాగిస్తుంటారు. తాజాగా ఈ బిగ్ బాస్ గురించి పాయల్ రోహ్తగ అనే బాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్లు చేసింది. హిందీలో ప్రసారమయిన బిగ్ బాస్ లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ షో నుండి బయటకొచ్చిన తర్వాత ఆ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ ను వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నారని, దానికోసం మమ్మల్ని బలి పశువులను చేస్తారని చెప్పుకొచ్చింది. పాయల్‌ రోహ్తగి తన ట్విట్టర్ లో “అమీషా పటేల్‌, కొయినా మిత్రా, రేష్మి దేశాయ్‌, సిద్ధార్ధ్‌ శుక్లా, అబూ మాలిక్‌..వీరందరూ ఇప్పుడు ఎలాంటి పనిలేక… ఇప్పుడు డబ్బు కోసం ‘బిగ్‌బాస్‌’ కి వచ్చారు. ఇక తక్కువ డబ్బులకే ఒప్పుకున్నారని ‘బిగ్ బాస్’ యాజమాన్యం వీళ్ళను తీసుకుంటారు. నేను కూడా బిగ్ బాస్ 2 లో వచ్చాను” అంటూ సంచలన ట్వీట్ చేసింది. ఈమె అలా ట్వీట్ చేసిందో లేదో దానికి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

Related posts