బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ తనపై లైగిక దాడికి పాల్పడ్డారంటూ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూని ప్రధాని వద్దకు కూడా తీసుకెళ్లిన పాయల్ మరోసారి అదే అనురాగ్ కశ్యప్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఆయన ఎన్టీఆర్పై కూడా నీచమైన కామెంట్స్ చేశాడని చెప్పింది. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు.. సతీ సావిత్రిలా ఎక్కువగా నటించకు అంటూ వల్గర్గా మాట్లాడారని ఓపెన్ అయింది. పాయల్ ఘోష్ ఆ రోజు జరిగిన సంఘటనను వివరంగా చెప్పింది. హసీతో ఫసి సినిమా చర్చల్లో భాగంగా అనురాగ్తో మాట్లాడుతుండగా.. టీవీలో ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ మూవీ వస్తోంది. అయితే రిఫరెన్స్ కోసం ఆ మూవీని అనురాగ్కి చూపించమని మేనేజర్ చెప్పడంతో తమ మధ్య ఆయన చర్చ వచ్చిందని, ఆ సమయంలోనే ఎన్టీఆర్ గురించి అనురాగ్ నీచంగా కామెంట్స్ చేయడం బాధపెట్టిందని పేర్కొంది పాయల్ ఘోష్. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఎలాంటివాడో స్పష్టంగా తెలిపింది పాయల్. అనురాగ్ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. దీంతో పాయల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
My friend and manager had asked Mr. Kashyap to see my film as a reference as we were supposed to meet for the discussion of a project. Mr. Kashyap maligned my relation with my costar without any truths..@narendramodi @HMOIndia @sharmarekha still waiting for Justice 🙏🏼 https://t.co/nfnsMY9a38
— Payal Ghosh (@iampayalghosh) November 4, 2020