నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటించారు. నీటిలో పూర్తిగా మునిగిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను రైతులను పరామర్శించారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి కారకం బాడీ మీదుగా లీలా మహల్ సర్కిల్ లోని హోటల్కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5 గంటలకు చిత్తూరు జిల్లా జనసే ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తుఫాను కారణంగా జిల్లాలో నెలకొన్ని పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు శ్రీ కాళహస్తిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి అనంతరం రైతులంతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 5న రాపూరు, వెంకటగిరిలో పవన్ పర్యటించనున్నారు. తర్వాత తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.
previous post
next post