పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్కల్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్, పోస్టర్ , టీజర్ సోషల్ మీడియా షేక్ చేసింది.
తాజాగా ఫ్యాన్స్ కోసం ఈ చిత్ర యూనిట్ మరో సర్ప్రైజ్ ఇచ్చింది. షూటింగ్ గ్యాప్లో కాస్త రిలాక్స్ అవుతున్న సమయంలో.. అన్వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ ఫొటోను విడుదల చేసింది. పవన్ మంచంపై పడుకుని ఉండగా, ఆ పక్కనే రానా కూడా ఫోటోలకు ఫోజిచ్చారు. చుట్టూ మార్కెట్ సెట్ ఉండగా, పవన్ షర్ట్ కు రక్తం, గాయమైనట్టుగా ఫొటోలో కన్పిస్తోంది. ఈ పిక్ చూస్తుంటే పవన్, రానా ల మధ్య ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అవుతుందని అన్పిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.అక్కడ క్లైమాక్స్లో వచ్చే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్లో హీరోలిద్దరూ కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ స్ర్కీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన