పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ఇక పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
పవర్స్టార్ అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ‘భీమ్లానాయక్’ చిత్రబృందం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రంలోని ‘అంత ఇష్టమా’ అంటూ సాగే రెండో పాటను అక్టోబరు 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ సాంగ్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేయగా.. అందులో పవన్ కల్యాణ్ బండ పై కూర్చొని తీక్షణంగా చూస్తూ ఉండగా పక్కనే ట్రెడిషనల్ లుక్లో నిత్యమీనన్ కూడా కూర్చుని ఉంది. ఆ వెనకాల ఉయ్యాల్లో పసిపాప ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘భీమ్లా నాయక్’ పాత్రలో పవన్.. డేనియల్ శేఖర్గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్, రానా పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
కత్రినా నన్ను వదిలేసింది… సల్మాన్ వ్యాఖ్యలు