ప్రపంచం మొత్తం డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి తమ ప్రేమను తెలియజేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్, అన్నా లెజినోవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. అంతేగాక పవన్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసింది నమ్రత. పవన్ తరచుగా తన తోటలోని మామిడి పండ్లని గిఫ్ట్గా పంపిస్తుంటారు. ఈ సారి మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు టాప్ హీరోస్ మధ్య నెలకొన్ని ఈ అనుబంధాన్ని చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. కాగా… మహేష్ దీపావళికి అందరికీ గిఫ్ట్స్ పంపిన విషయం తెలిసిందే. ఈ గిఫ్ట్స్ అందుకున్న వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
previous post
తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు : శర్వానంద్