మరో పది రోజుల పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పోడగించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఏడు వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాగా ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు జూలై 26 అనగా శుక్రవారంతో ముగియాలి, విపక్షాల డిమాండ్తో సమావేశాలను పోడిగించారు. ఇదే విషయాన్ని త్రిబుల్ తలాక్ బిల్లు పాస్ అయిన తర్వాత జోషి స్పికర్ ఓం బిర్లాకు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల పోడగింపుకు సంబంధించి బుధవారమే ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సాయంత్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంంది. పార్లమెంట్లో పలు అంశాలపై చర్చించడం కోసం మరిన్నిరోజులు పోడగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.