telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ 27వ సినిమా ఈ దర్శకుడితోనే ?

even I donot get ticket in AMB said mahesh

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జ‌రుపుకుంటుంది. అయితే మ‌హేష్ కోసం ఇప్ప‌టికే ఇప్పటికే రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొర‌టాల శివ‌, సందీప్ వంగా, పరుశురామ్ వంటి దర్శకులు లైన్‌లో ఉన్నారని తెలుస్తోండ‌గా, ఏ ద‌ర్శ‌కుడితో త‌ర్వాతి ప్రాజెక్ట్ చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. ప‌ర‌శురాం త‌ప్ప మిగ‌తా ద‌ర్శ‌కులు అంతా వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో మ‌హేష్ త‌న 27వ సినిమాని ప‌ర‌శురాంతో చేస్తాడ‌ని టాక్. ఇప్ప‌టికే క‌థ‌ని సిద్దం చేసుకున్న ప‌ర‌శురాం .. మ‌హేష్ ఓకే అంటే వెంట‌నే త‌న ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌నే టాక్ విన్పిస్తోంది.

Related posts