telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రమోషన్ కు వస్తావా ? రెమ్యూనరేషన్ తిరిగిస్తావా ?…. త్రిషకు నిర్మాతల షాక్

Trisha

చెన్నై చంద్రం త్రిష తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపదం విలయాట్టు’ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై సినీ నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండురోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే త్రిష పారితోషికంలో సగం వెనక్కివ్వాలని హెచ్చరించింది. గత పదిహేనుళ్ళకు పైగా వెండితెరపై కథానాయికగా సత్తా చాటుతుంది చెన్నై పొన్ను త్రిష. గతేడాది కోలీవుడ్‌లో ‘96’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రిష ‘పరమపదం విలయాట్టు’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేసింది. ఇది ఆమె 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా, ఒక పాపకు తల్లిగా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కె. తిరుజ్ఞానమ్ దర్శకత్వంలో, 24 HRS ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 28న విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు చెన్నైలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మూవీ టీమ్ అందరూ వచ్చినా కథానాయిక త్రిష మాత్రం నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చింది. దీంతో నిర్మాతలు త్రిషపై బహిరంగంగానే విమర్శలు చేశారు. త్రిష ప్రధానపాత్రలో నటించిన సినిమా ఫంక్షన్‌కు ఆమె రాకపోతే ఎలా.. ఇది ఆమె బాధ్యత.. ప్రమోట్ చేస్తేనే కదా ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేది.. త్రిష కనుక రెండురోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే పారితోషికంలో సగం వెనక్కివ్వాలని హెచ్చరించారు. సినిమా ప్రమోషన్లకు నటీనటుల రాకపోవటంపై తమిళ నిర్మాతల మండలి కూడా చర్చలు జరిపి ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

Related posts