telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ కుటుంబం కన్ను విశాఖపై పడింది: పంచుమర్తి అనురాధ

Panchumarthi-Anuradha

సీఎం జగన్ కుటుంబం కన్ను విశాఖపై పడిందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖలో కడప దందాలు పెరిగాయని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం ఇప్పటివరకు 32 వేల ఎకరాలు కబ్జా చేసిందని అన్నారు. వైఎస్ రాజారెడ్డి పేరుమీద ధర్మాన ప్రసాదరావు భూములు కొట్టేశారని అనురాధ ఆరోపించారు. 7 నెలల వ్యవధిలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల భూములనూ కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దారిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నం జరిగిందని ఆమె వివరించారు. తాజాగా ల్యాండ్ పూలింగ్ పేరుతో విశాఖలో పేదల భూమి కబ్జా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో వైసీపీ నేతల భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

Related posts