telugu navyamedia
రాజకీయ వార్తలు

బార్డర్ లో పాకిస్తాన్ కాల్పులు.. భారత పౌరుడు మ‌ృతి

kashmir police firing

జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతంలో  పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. శుక్రవారం ఉదయం ఫూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్ని సెక్టార్ల పరిధిలో హఠాత్తుగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మన పౌరుడు ఒకరు మరణించినట్టు సైన్యం ప్రకటించింది. పాక్ కాల్పులు జరిపిన చోట సైన్యం వెంటనే అప్రమత్తమై.. దీటుగా బదులిచ్చిందని తెలిపింది. మన సైనికులెవరూ గాయపడలేదని పేర్కొంది.

పూంఛ్ జిల్లాలోని కునైయన్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ కలిసి చేపట్టిన కార్డన్ సెర్చ్ లో టెర్రరిస్టుల డంప్ బయటపడింది. ఒక ఏకే 47 గన్, ఒక చైనా పిస్టల్, బుల్లెట్లు, కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పూంఛ్ ఎస్పీ ప్రకటించారు.

Related posts