telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భారత బలగాలు!

2 terrorists killed in Jammu and Kashmir

భారత్ లో 73వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ మరోసారి తోకజాడించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను, శాంతి ఒడంబడికలను తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్ సరిహద్దులో కాల్పులకు తెగబడింది. భారత్ ఎంత స్వీయనియంత్రణ పాటిస్తున్నా పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు ఆగడంలేదు. తాజాగా, పూంచ్ జిల్లాలోని కేజీ (కృష్ణా ఘాటీ) సెక్టార్ లో పాక్ రేంజర్లు భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. ప్రస్తుతం కేజీ సెక్టార్లో హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి.

Related posts