ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రతినిధి తిరుమూర్తి ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ దౌత్యపరంగా దిగజారి వ్యాఖ్యలు చేశారని ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారని మండిపడ్డారు.
నిన్న జరిగిన ఈ ఈ సమావేశానికి ఇమ్రాన్ వర్చువల్గా హాజరయ్యారు. ఆయన ఉపన్యనిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీపై ఇమ్రాన్ వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు కాశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిటిటో వినిటో వాకౌట్ చేశారు.
ఇమ్రాన్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఐరాస జనరల్ అసెంబ్లీ హాలు నుంచి వినిటో వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.పాకిస్థాన్ తన సొంత సరిహద్దు ఉగ్రవాదం గురించి వ్యక్తిగత దాడులకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.