telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్‌ చర్యలను తిప్పి కొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధం: పాక్‌ ప్రతినిధి గఫూర్‌

Surgical Strike 2Pakistan Indian air space

తమ పై భారత్‌ ఎలాంటి చర్యలకు పాల్పడ్డ తిప్పి కొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌(ఆర్మీ మీడియా వింగ్‌) అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ అన్నారు. ప్రతీ అంశంలోనూ పాకిస్తాన్‌ ఎంతో సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

అయితే భారత్‌ మాత్రం ఎల్లప్పుడూ తమను బెదిరిస్తూ రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

Related posts