ఒకపక్క శాంతి అంటూనే, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోపక్క భారత్ శత్రువు చేతిలో చిక్కుకున్న పైలెట్ ను రక్షించేందుకు యోచిస్తుంది. నిన్న రెండు యుద్ధవిమానాలతో దాడికి పాక్ ప్రయత్నించింది. అలాగే నేడు కూడా ఒకపక్క శాంతి అంటూనే .. యుద్ధ విమానాలతో భారత భూభాగంలోకి వచ్చింది.
నేడు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ జెట్స్ దుస్సాహసానికి పూనుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని మెంధర్ సెక్టార్లోకి చొరబడేందుకు రెండు పాక్ యుద్ధ విమానాలు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే.. భారత వైమానిక దళం వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టినట్టు తెలిసింది. దీనితో పాక్ జెట్స్ వెనుదిరిగినట్లు తెలిసింది.
సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు