పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీనితో ఆయన లండన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఆయన్ను అత్యవసరంగా దుబాయ్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్రఫ్ను దుబాయ్కి తరలించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ తన కాళ్ల మీద నిలబడలేకపోతున్నారనీ, నడవలేకపోతున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యాధి కోసం లండన్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు.
విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చింది… లాక్ డౌన్ అనుభవాన్ని షేర్ చేసిన రకుల్