పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతప్రభుత్వం చేసిన సాహసోపేతమైన చర్యలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను నిర్భందించిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 17వ తేదీన భారత సైన్యం జరిపిన కాల్పుల్లో హతమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అహ్మద్ పాక్ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్లో సుబేదార్గా పని చేస్తున్నాడు. ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో స్పెషలిస్ట్ గా పేరున్న అహ్మద్ ఖాన్ చివరికి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్ సెక్టార్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.