సూపర్స్టార్ మహేష్ హీరోగా, సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతోన్న భారీ చిత్రం “మహర్షి”. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్వైడ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగి సినిమాపై అందరిలో భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించారు చిత్రబృందం. వచ్చేనెల 1న హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లోని “పీపుల్స్ ప్లాజా”లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “‘పదరా పదరా ఈ వెలుగును పలుగు దించి పదరా” అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట అద్భుతంగా ఉందని మహేష్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా… నెటిజన్లు మాత్రం ఈ ట్యూన్ కూడా ఎక్కడో విన్నట్లే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
next post
ఎవరితో పడుకోవాలో కూడా అతడే నిర్ణయిస్తాడు… స్టార్ ప్రొడ్యూసర్ పై కంగనా సోదరి సంచలన వ్యాఖ్యలు