telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్ కు షాక్… పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి జంప్..

హైదరాబాద్ లోటీఆర్ఎస్ కుభారీ షాక్ తగిలింది. పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. 

ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి శనివారం ఉదయం​ మర్యాదపూర్వకంగా కలిశారు.

రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విజయారెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ..నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. పార్టీలోనే మరణించారు. కాంగ్రెస్ తో మాది విడదీయలేని బంధం అని, మా కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉంద‌ని అన్నారు

దేశంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం. అందరితో చర్చించాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు. నాన్న పీజేఆర్ బాటలో నడుస్తా’’ అని విజయా రెడ్డి వెల్లడించారు.

TRS Corporator Vijayareddy meets TPCC Chief Revanth Reddy - Sakshi

తనకు కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్ముతున్నానని చెప్పారు.  ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ రాజకీయం అవసరం అని అన్నారు. తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని.. ఆ పార్టీలో సాగితేనే బాగుంటుందని విజయారెడ్డి తెలిపారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా వెల్లడించారు. 

 

Related posts