telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ కొరతతో మరో 20 మంది బలి

ఢిల్లీ లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. నిన్నటికి నిన్న సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా రోగులు మృతి చెందగా.. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారు. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంట మాత్రమే వస్తుందని.. అది కూడా అయిపోతే 200 మంది రోగుల ప్రాణాలకు ప్రమాదమని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. ఢిల్లీ ఆస్పత్రి లలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కేంద్రంపై హై కోర్టు ఘాటుగా ఫైర్ అయిన తర్వాత కూడా పరిస్థితి మార్పు రాకపోవడం గమనార్హం.

Related posts