telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధం..ఒకరు సజీవ దహనం

Ask lift thieft car cellphone vizag
రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. జౌటర్‌పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం అవగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.ప్రమాదానికి గురైన కారు మేడ్చల్ నుంచి పఠాన్‌చెరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  రిజిస్టేషన్‌ నంబర్‌ను(TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరున ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts