భారతమాత హిమాలయ సిగ లో ……
భారత సైన్యం పువ్వుల్లా……
విరబూస్తున్నారు..
అపుడపుడు రక్త సింధూరం తిలకం దిద్దుతూ…..
తమ బాధ్యతను నిరూపించుకుంటున్నారు…..
దేశంలో ప్రతి పౌరుడు …..
యుద్దవీరుడు కాకపోయినా…..
కనీసం తన విలువైన ఓటును…..
ఆయుధంగా తలచి…..
అవినీతిపరులను, ఆపితే చాలు……
ఎందరో మహానుభావులు ప్రాణాలొడ్డి……
తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని
ఒక్కపూట నోటుకు….
ఓటును అప్ప చేప్పే ప్రజలు ఉన్నంతవరకు….
నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు కాదు…
భారతావని ప్రతి పౌరుడు …….
ఈ కార్యక్రమంలో మంచి చదువు ……
వ్యక్తిత్వం ఉన్న నాయకులకు ఓటు వేసి….
తమ దేశ రక్షణ బాధ్యతను కాపాడగలడు.
ఒక సైనికుడు లా !
-జె.పద్మావతి
ఆదోని.