పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వాయుసేన మంగళవారం చేసిన మెరుపు దాడులను పాక్ ప్రభుత్వం దృవీకరించింది. పాక్ కి బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో షేమ్ షేమ్ అంటూ పార్లమెంట్ లో ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. భారత ఆర్మీ మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో ఎల్వోసీ వద్ద ఉన్న ఉగ్ర స్థావరాలపై వైమానిక దళం దాడికి పాల్పడింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే పాక్ యత్నం విఫలమైనట్టుగా తెలుస్తుంది. భారత్ మిరాజ్ యుద్ద విమానాల స్థాయిని చూసి పాక్ ఎఫ్16 విమానాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తుంది.