మొబైల్ దిగ్గజం ఒప్పో తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో విడుదల చేసింది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన ‘ఒప్పో ఆర్15 ప్రో’ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్ ని ఏర్పాటు చేశారు. అమెజాన్ లో ప్రత్యేకంగా లభించనున్న ఈ ఫోన్ పై భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్ ఫోన్ ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు.
ఈ ఫోన్ ప్రత్యేకతలు:
* 6.28″ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే ( 2280 × 1080 పిక్సల్స్)
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
* 16/20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 3400 ఎంఏహెచ్ బ్యాటరీ