telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

సాఫ్ట్ వేర్ శ్వేత కేసులో కొనసాగుతున్న విచారణ…

సాఫ్ట్ వేర్ శ్వేత కేసులో విచారణ కొనసాగుతుంది. అయితే ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ప్రియుడు అజయ్ పెట్టడంతో ట్రైన్ ఎదురు వెళ్లి ఆత్మహత్యకు చేసుకుంది శ్వేత. కానీ తన కూతురు ని అజయ్ అనే యువకుడు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారంటూ శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ , పెళ్లి పేరుతో శ్వేత ను మోసం చేశాడంటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్వేతతో వ్యక్తి గతంగా దిగిన ఫోటోలని సోషల్ మీడియా లో ప్రియుడు అజయ్ పోస్ట్ చేసాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్వేత ,గత నెల 18 తేదీ నుండి కనిపించడం లేదు. ఇక నిన్న బీబీనగర్ వద్ద రైల్ పట్టాలు పై శవమై కనిపించింది. అయితే శ్వేత కేసు ఆత్మహత్య ? హత్య ? అనే కోణం లో విచారణ జరుగుతుంది. ఇక నిందితుడు అజయ్ ను అరెస్ట్ చేసారు మేడిపల్లి పోలీసులు . సిసి ఫుటేజ్ లు చూపించాలని శ్వేత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts