telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనం మరో జంతువుతో మానసికంగా ఒకటైతే… : కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. కంగనా తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్ అవుతోంది. అందులో తాను ముంబైలో మిస్ అవుతుంది అదొక్కటే అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం కంగనా మనాలీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనాలీలో గత కొన్ని నెలలుగా ఉండేసరికి ముంబైలో తాను చేసే గుర్రపు స్వారీని బాగా మిస్ అవుతున్నాని చెప్పింది. “నేను ఎప్పుడూ అంతగా క్రీడల్లో ప్రవేశం లేదు. కానీ ముంబైలో రోజు పోద్దున్నే గుర్రపు స్వారీ చేస్తుంటే బాలా బాగుండేది. మనం మరో జంతువుతో మానసికంగా ఒకటైతే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది” అని ట్వీట్ చేసింది కంగనా. కాగా గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Related posts