telugu navyamedia
క్రైమ్ వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శించుకొని కొండ మీద నుంచి కిందకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరో 3 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడిని వారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కారు అదుపుతప్పి పక్కనున్న రెయిలింగ్ ను ఢీకొనడం వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారిని తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

Related posts