telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురంలో : 5 మంది సింగర్లతో “ఓ మై డాడీ” సాంగ్

AY

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో..’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రంలోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన, ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్‌ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్‌ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్‌ని లేడీ కాష్ పాడింది. గాయకుడు ‘రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్‌లో పాడి ఉర్రూతలూగించారు. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు. ‘’ఓ మై డాడీ” సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్‌గా, చార్ట్ బస్టర్స్‌లో టాప్‌లో నిలుస్తోంది.

Related posts