telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తే… 50వేల బహుమతి..

odisa collector gift on proof to ghosts

ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలతో సహా వచ్చేవారికి ఆ బహుమతి ఇస్తామన్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు రివార్డు ఇస్తాను. స్వయంగా నా జేబు నుంచే ఆ డబ్బులు చెల్లిస్తా అని తెలిపారు. చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశానని తెలిపారు.

Related posts