అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. 90 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ట్రంప్పై ఒబామా కీలక వ్యాఖ్యలు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ… కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన అన్నారు.
కరోనా విపత్తు సమయంలోనూ తమ దేశంలో నల్ల జాతీయులపట్ల వివక్ష కొనసాగుతోందని ఆయన తెలిపారు. వారు కొన్నేళ్లుగా ఇక్కడ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆయన చెప్పారు. కొందరు బయటకు వెళ్లిన సందర్భాల్లో హత్యలకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనాతో అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. కరోనా ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసిందని ఆయన చెప్పారు. పరిస్థితులన్నీ తలకిందులయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి